- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మకు తొలి బంగారు బోనం
దిశ, చార్మినార్ : ఆషాఢమాసం పాతనగర బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సప్తమాత్రికలకు సప్త బోనాలులో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి ఆదివారం తొలి బంగారు బోనం సమర్పించారు. బ్యాండ్ చప్పుళ్ళు ...పోతరాజుల వీరంగాల నడుమ... శివసత్తుల నడుమ నిషా క్రాంతి బంగారు బోన మెత్తుకుని మీరాలం మండి శ్రీ మహంకాళి దేవాలయం నుంచి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా బయలుదేరారు. అంతకుముందు మీరాలం మండి శ్రీ మహంకాళి దేవాలయంలో అమ్మవారికి ఉమ్మడిదేవాలయాల ఉరేగింపు కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మీరాలం మండి నుంచి గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయానికి చేరుకుని అక్కడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులను ఆలయ కమిటీ ఘనంగా శాలువలతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య, వివిధ ఆలయ కమిటీ ప్రతినిధులు రాకేష్ తివారి, జనగామ మధుసూదన్గౌడ్, మధు సూధన్ యాదవ్, హంసరాజ్, కె ఎస్ ఆనంద్, బి వై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.