Kishan Reddy : ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

by Kalyani |
Kishan Reddy : ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, సికింద్రాబాద్: ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా కార్యదర్శి మద్దెర్ల శ్యాంసుందర్ ఆధ్వర్యంలో వారసిగూడలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో పలు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన మద్దెర్ల శ్యాంసుందర్ ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన బిజెపి మెంబర్షిప్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. వైద్య శిబిరంలో దాదాపు 600 మందికి పైగా హాజరై వివిధ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, నాగేశ్వర్ రెడ్డి, కనకట్ల హరి, రవి ప్రసాద్ గౌడ్, ప్రభు గుప్తా, వెంకటేష్ గౌడ్, రఘు, యాదగిరి, రాజు తదితరులు హాజరయ్యారు.

Advertisement

Next Story