సువర్ణవకాశం…డిసెంబర్ 5న చెన్నై నుండి సౌత్ స్టార్ రైల్ ప్రారంభం

by Kalyani |
సువర్ణవకాశం…డిసెంబర్ 5న చెన్నై నుండి సౌత్ స్టార్ రైల్ ప్రారంభం
X

దిశ, హిమాయత్ నగర్ : కర్ణాటక ఆలయాలను సందర్శించే సువర్ణ అవకాశం టూర్ టైమ్స్ కల్పిస్తుంది. ఇండియన్ రైల్వేస్, భారత్ గౌరవ్ రైలు పథకం కింద తొలిసారిగా ప్రైవేట్ సెక్టార్ చెందిన సౌత్ స్టార్ రైల్ డిసెంబర్ 5న చెన్నై లో ప్రారంభం అవుతుందని, టూర్ టైమ్స్ ఏపీ, తెలంగాణ రీజినల్ డైరెక్టర్ రమేష్ అయ్యంగార్, సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విగ్నేష్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ స్టార్ రైల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఈ రైల్ లో 9 రోజుల వ్యవధిలో కర్ణాటకలోని అత్యంత ప్రముఖ దేవాలయాలు నవ బృందావనం, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు, శృంగేరి, హొరనాడు, ధర్మస్థల, కుకి సుబ్రమణ్య, మైసూర్, శ్రీరంగపట్నం, మేల్కోటేలను సందర్శించవచ్చాని పేర్కొన్నారు.

ప్రతి కోచ్‌కు సీసీటీవీ కెమెరాలు, టూర్ మేనేజర్, సెక్యూరిటీ గార్డ్స్వం టి అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. భోజన వసతి కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణ లో ఈ ప్రత్యేక రైల్ గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, నల్గొండ, మిర్యాలగూడ, సికింద్రాబాద్‌లలో రైలు ఎక్కేందుకు వీలు కల్పిస్తున్నాట్లు పేర్కొన్నారు. ఈ యాత్రలో పాల్గొని గోకర్ణలోని నక్షత్రం, తిథితో సంబంధం లేకుండా పిండ తర్పణం చేసి మన పూర్వీకుల ఆశీస్సులు పొందే అవకాశం ఉందన్నారు. ప్రతి కోచ్‌కు సెక్యూరిటీ గార్డులు ఉంటారని తెలిపారు. సీనియర్ సిటిజన్లకు ఒక చక్కటి అవకాశం అని వీరికి సబ్సిడీ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రయాణం కోసం లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ )ని ఉపయోగించవచ్చు అన్నారు. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. స్లీపర్ క్లాస్ 27,000, ప్యాకేజీ థర్డ్ ఏసీకి రూ. 33,000/-, థర్డ్ ఏసీ ప్రీమియం రూ. 37,000/- సెకండ్ ఏసీకి రూ. 40,000/- తో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్న యాత్రికులు www.traintour.in లేదా 93550 21516 సంప్రదించవచ్చు అని తెలిపారు.

Next Story