- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
హైదరాబాద్లో మరో దారుణం.. వృద్ధ దంపతుల దారుణ హత్య
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు వృద్ధ దంపతులను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణమైన సంఘటన అంబర్పేటలోని సాయిబాబానగర్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాయిబాబానగర్ కాలనీలో లింగారెడ్డి, ఊర్మిళాదేవి అనే వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతురాలు ఊర్మిళాదేవి ఒంటిపై నగలు లేకపోవడం గమనించారు. దీంతో దొంగలు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story