హైదరాబాద్‌లో మరో దారుణం.. వృద్ధ దంపతుల దారుణ హత్య

by Mahesh |
హైదరాబాద్‌లో మరో దారుణం.. వృద్ధ దంపతుల దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు వృద్ధ దంపతులను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణమైన సంఘటన అంబర్‌పేటలోని సాయిబాబానగర్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాయిబాబానగర్ కాలనీలో లింగారెడ్డి, ఊర్మిళాదేవి అనే వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతురాలు ఊర్మిళాదేవి ఒంటిపై నగలు లేకపోవడం గమనించారు. దీంతో దొంగలు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story