- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
HYD : ఉప్పల్ భగాయత్లో మహిళ మర్డర్
దిశ, ఉప్పల్: మహిళను ఓ వ్యక్తి కారుతో ఢీ కొట్టి హత్య చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెన్నాం చంద్రమౌళి (47)అనే వ్యక్తి ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఎస్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ డైరెక్టర్గా ఆఫీస్ నడుపుతున్నాడు. అదే రియల్ ఎస్టేట్ ఆఫీస్లో రామంతపూర్కు చెందిన కొమ్మవారి మంజుల (40)ఉద్యోగం చేస్తుంది. రియల్ ఎస్టేట్ డైరెక్టర్ చంద్రమౌళికి మంజులతో మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మూడు నెలల నుంచి మరో వ్యక్తితో సదరు మహిళ సన్నిహితంగా ఉందని చంద్రమౌళి అనుమానం పెంచుకున్నాడు.
అంతే కాకుండా మృతురాలు చంద్రమౌళి దగ్గర నుంచి రూ.28 లక్షలు తీసుకొని అడిగితే ఇవ్వడం లేదని తెలిసింది. దీంతో ఆమె మీద కక్ష పెంచుకొని మద్యం సేవించి ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఉప్పల్ భగయత్కి తీసుకవచ్చి కారుతో ఢీ కొట్టి హత్య చేశాడు. నిందితుడు నేరుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.