HYD : మల్కం చెరువు వద్ద కారు యాక్సిడెంట్.. యువకుడు స్పాట్ డెడ్

by Rajesh |
HYD : మల్కం చెరువు వద్ద కారు యాక్సిడెంట్.. యువకుడు స్పాట్ డెడ్
X

దిశ, శేరిలింగంపల్లి : అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఈ తెల్లవారుజామున రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో స్విఫ్ట్ డిజైర్ కారు నుజ్జునుజ్జు అయింది. మెహదీపట్నంకు చెందిన చరణ్ (19) ఇక్ఫై యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నాడు. గతరాత్రి ఇంటి నుండి స్విఫ్ట్ డిజైర్ కారులో బయలుదేరిన చరణ్ రాత్రి అంతా నగరంలో పలుచోట్ల తిరిగాడు.

ఈ తెల్లవారుజామున ఇంటికి వెళ్లే క్రమంలో నందిహిల్స్ నుండి అతి వేగంగా వచ్చి మల్కం చెరువు వద్ద ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో స్విఫ్ట్ డిజైర్ కారు నుజ్జు నుజ్జు అయింది. కారు మొత్తం ఒక్క దగ్గరకు వచ్చింది. అందులోనే ఇరుక్కుని మృతి చెందిన చరణ్‌ను పోలీసులు అతికష్టంగా వెలికి తీశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని రాయదుర్గం పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed