ట్యాంక్ బండ్ వద్దకు మహాగణపతి.. ఆకాశంలో భారీ సంఖ్యలో డ్రోన్లు

by Mahesh |
ట్యాంక్ బండ్ వద్దకు మహాగణపతి.. ఆకాశంలో భారీ సంఖ్యలో డ్రోన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అత్యంత ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చివరి అంకానికి చేరుకుంది. పోలీసులు ముందస్తు ప్రణాళికల్లో భాగంగా సోమవారం అన్ని కార్యక్రమాలను నిర్వహించుకున్న మహాగణపతి గంగమ్మ ఓడికి చేరుకునేందుకు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాడు. ఈ ఖైరతాబాద్ వినాయకుడు రాష్ట్ర సచివాలయం ముందుకు రాగానే ఒక్కసారిగా గాలిలో పదుల సంఖ్యలో డ్రోన్‌లు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆకాశంలో ఎటు చూసిన డ్రోన్‌లు.. గద్దల మాదిరిగా ఎగురుతూ కనిపించాయి. మహాగణపతిని తమ కెమెరాల్లో చిత్రీకరించేందుకు వందల సంఖ్యలో యూట్యూబర్లు ఈ డ్రోన్లను గాలిలో ఎగురవేశారు. ఇదిలా ఉండే మరికొన్ని క్షణాల్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి కాబోతుంది. ప్రస్తుతం ట్రక్ నుంచి వినాయకుడని విడదీసి.. క్రేన్ వైర్లను కట్టే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. కాగా ఈ ప్రక్రియను మొత్తం సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed