Harish Rao : బయోడైవర్సిటీ ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలి : హరీష్ రావు డిమాండ్

by Ramesh N |
Harish Rao : బయోడైవర్సిటీ ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలి : హరీష్ రావు డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బయోడైవర్సిటీ ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలంగాణ సీఎంఓకు ట్యాగ్ చేశారు. ఏడాదికి పైగా వేతనం లేకుండా.. తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు సిబ్బంది, శాస్త్రవేత్తల నుంచి గ్రౌండ్‌ సిబ్బంది వరకు నిస్సహాయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 10 కోట్ల నిధులను కేటాయించినప్పటికీ, ఈ నిధులను విడుదల చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. ఉద్యోగులకు నెలలో మొదటి రోజే జీతాలు ఇస్తామని కాంగ్రెస్ వాదనలు ఉన్నప్పటికీ, మన ఉద్యోగులు కఠినమైన వాస్తవాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షకులకు మద్దతుగా వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story