- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Gurukula: ప్రజాభవన్లో గురుకుల అభ్యర్థుల ఆందోళన
దిశ, డైనమిక్ బ్యూరో: బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని ప్రజా భవన్ లో గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటికే గురుకులాల్లో నియామకాలు భర్తీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నియామకాల్లో హైకోర్టు ఆదేశాల మేరకు నియమ నిబంధనలు పాటించకపోవడంతో బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోయాయని, వాటిని వెంటనే అర్హులైన మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్ లో గురుకుల అభ్యర్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ తొందరపాటు నిర్ణయం, అధికారుల నిర్లక్ష్యంతో 3 వేల కుటుంబాలు బలి అయ్యాయని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. పరీక్ష రాసి మెరిట్ తెచ్చుకొని, అర్హత ఉన్నా ఉద్యోగాలు రాలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన తమకు గురుకుల టీచర్ పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.