- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
గోవా గవర్నర్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్
![గోవా గవర్నర్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ గోవా గవర్నర్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్](https://www.dishadaily.com/h-upload/2024/06/30/347701-tg-govarner.webp)
దిశ, తెలంగాణ బ్యూరో : ‘రామచిలుక’ పుస్తకంలో తెలివైన మరియు ఆలోచింపజేసే కథలతో పాఠకులను రచయిత కట్టిపడేశారని రాష్ట్ర గవర్నర్ పీసీ రాధాకృష్ణన్ అన్నారు. గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై రచించిన ‘రామచిలుక’ తెలుగు అనువాద పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్లోని రాజ్భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ శ్రీధరన్ పిళ్లై ఈ రచనలో తన సాహిత్య నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు. ‘రామచిలుక’ అతని బహుముఖ ప్రజ్ఞకు, శ్రేష్ఠతకు నిబద్ధతకు నిదర్శనం అన్నారు. సాహిత్య వారసత్వానికి చేసిన అమూల్యమైన కృషిని కొనియాడారు. ఈ పుస్తకానికి తగిన గుర్తింపు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం, గోవా గవర్నర్ కార్యదర్శి ఎంఆర్ఎం రావు, ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్, కె. శివారెడ్డి, రాంచందర్ రావు, ఎల్.ఆర్. స్వామి, తదితరులు పాల్గొన్నారు.