GOVERNOR: ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

by Prasad Jukanti |
GOVERNOR: ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. ఖైరతాబాద్ గణేశుడిని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లంబోదరుడికి గవర్నర్ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, అందరిపై వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించినట్లు గవర్నర్ చెప్పారు. అంతకు ముందు గవర్నర్ కు పూర్ణ కుంభంతో పూజారులు స్వాగతం పిలికారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీని ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు.

Advertisement

Next Story