చెంబులోంచి డబ్బులు కురుస్తాయని ఘరానా మోసం.. ఎక్కడంటే?

by Sathputhe Rajesh |
చెంబులోంచి డబ్బులు కురుస్తాయని ఘరానా మోసం.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: చెంబులోంచి డబ్బులు కురుస్తాయని నమ్మంచి ఓ వ్యక్తి ఏకంగా రూ. 21లక్షలు కాజేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా వెల్జర్లకు చెందిన మహేష్, మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మల్లాపూర్ కు చెందిన వివేకానందగౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి హైదరాబాద్ లో నంద్యాల జిల్లాకు చెందిన రంగస్తామి పరిచయమయ్యాడు. పూజలు చేసిన చెంబు ఇస్తానని, దాంట్లోంచి డబ్బులు కురుస్తాయని నమ్మించి మహేష్, వివేకానంద నుంచి రూ.21లక్షలు కాజేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement
Next Story

Most Viewed