గౌడన్నలు పౌరుశానికి, పోరాటానికి ప్రతీకలు: సీఎం రేవంత్

by Satheesh |
గౌడన్నలు పౌరుశానికి, పోరాటానికి ప్రతీకలు: సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: గౌడన్నలు పోరాటానికి, పౌరుశానికి ప్రతీకలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్, ధర్మ భిక్షం గౌడం, మోహన్ గౌడ్, దేవేందర్ గౌడ్ తెలంగాణకు సేవ చేశారని గుర్తు చేశారు. గౌడలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యం ఇచ్చామని, గౌడ సోదరుడు పొన్నం ప్రభాకర్‌ను మంత్రిని చేశాం, మహేష్ కుమార్ గౌడ్‌ను ఎమ్మెల్సీ చేశాం. మధుయాష్కీ గౌడ్‌కు త్వరలోనే పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గౌడ సోదరులు ప్రచారం చేశారని.. కళ్లు గీత కార్మికులకు అద్భుత ప్రచార నైపుణ్యం ఉందని కొనియాడారు. కళ్లు గీత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కాటమయ్య కిట్ల పథకాన్ని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలంలో గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. నీరా షాపులు పెట్టుకునేందుకు అవకాశం కల్పి్స్తామన్నారు. గీత కార్మికుల కోసం రోడ్ల వెంబడి తాటి, ఈత చెట్లు నాటుతామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed