CM రేవంత్ ఇంట్లో గణపతి పూజ.. ఫ్యామిలీతో పాల్గొన్న టీ.కాంగ్రెస్ కొత్త బాస్

by Gantepaka Srikanth |
CM రేవంత్ ఇంట్లో గణపతి పూజ.. ఫ్యామిలీతో పాల్గొన్న టీ.కాంగ్రెస్ కొత్త బాస్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కలిశారు. శనివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన గణపతి పూజలో మహేశ్ కుమార్ గౌడ్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. కాగా, పీసీసీ చీఫ్‌గా నియామకం అయ్యాక.. సీఎం రేవంత్‌తో తొలిసారి మహేశ్ కుమార్ గౌడ్ భేటీ కావడం విశేషం. కాగా, దాదాపు 38 ఏళ్ల నుంచి మహేశ్ కుమార్ గౌడ్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూనే ఉన్నారు.

2016 నుంచి 2021 వరకు పీసీసీ జనరల్ సెక్రటరీగా పార్టీలో క్రీయాశీలకంగా పనిచేశారు. 2021 నుంచి తెలంగాణ ప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు. మహేష్​ కుమార్ గౌడ్ నియామకంపై ఆయన ఫాలోవర్స్ సంబురాలు చేసుకున్నారు. పుట్టిన జిల్లా నిజామాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో సెలబ్రేషన్స్ జరిగాయి. ఇక పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్​ కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.




Advertisement

Next Story