రాష్ట్రంలో 5 లక్షల మొక్కలు నాటాలి: ఎండల లక్ష్మీనారాయణ

by srinivas |
రాష్ట్రంలో 5 లక్షల మొక్కలు నాటాలి: ఎండల లక్ష్మీనారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నుంచి జయంతి వరకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను బీజేపీ చేపడుతోంది. అందులోభాగంగా తెలంగాణలో 5 లక్షల మొక్కలను నాటాలని నిర్దేశించుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణహితం కోసం మొక్కలు నాటాలని శ్రేణులకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. దేశ సమగ్రత కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ చేసిన బలిదానాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజలకు వివరించి మొక్కలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈనెల 30 తేదీ వరకు మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి బూత్‌లో పది మొక్కలు నాటాలని సంకల్పించినట్లు చెప్పారు. జిల్లాలవారీగా మొక్కలను యువ మోర్చా, ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా నేతలు అందజేస్తారని తెలిపారు.



Next Story