రుణమాఫీపై రేవంత్ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు: నిరంజన్ రెడ్డి ఫైర్

by Satheesh |
రుణమాఫీపై రేవంత్ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు: నిరంజన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు, రుణమాఫీ రెండింటికీ పట్టాదారు పాస్ బుక్ ప్రామాణికమైనప్పుడు.. రుణమాఫీ చేసిన రైతులకు రైతు భరోసా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఐదెకరాలలోపు రైతులకైనా వెంటనే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని.. మరీ ఇప్పుడు విడతల వారీగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అర్హులైన రైతులందరికీ ఒకే విడతలో రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొంత మందికి రుణమాఫీ చేసి సంబురాలు చేసుకోకండని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీకి అర్హులైన రైతుల లెక్కలను ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. కరోనా మహ్మమారి విపత్తు సమయంలో బీఆర్ఎస్ రైతు బంధు ఇచ్చిందని.. రూ.29 వేల కోట్లు షరతులు లేకుండా మాఫీ చేసిందని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed