తండ్రి డీఎస్ కన్నుమూత.. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమోషనల్ నోట్

by Rajesh |
తండ్రి డీఎస్ కన్నుమూత.. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమోషనల్ నోట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ దిగ్గజం, కాంగ్రెస్ సీనియర్ నేత డీ. శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆస్పత్రి తరలిస్తుండగానే డీఎస్ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, తండ్రి డీఎస్ మృతి పట్ల కొడుకు, ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇకలేరు.. ఐ విల్ మిస్ యూ డాడీ! నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావు..’ అని బరువెక్కిన గుండెతో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు తండ్రి డీఎస్‌తో ఉన్న తన ఫొటోను ఎంపీ అర్వింద్ షేర్ చేసారు.



Next Story