క్యూరం పబ్‌పై ఎక్సైజ్ అధికారుల దాడులు.. ఇద్దరికి పాజిటివ్

by Gantepaka Srikanth |
క్యూరం పబ్‌పై ఎక్సైజ్ అధికారుల దాడులు.. ఇద్దరికి పాజిటివ్
X

దిశ, శేరిలింగంపల్లి: మాదకద్రవ్యాల నియంత్రణకు ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినా డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులు మాత్రం ఎక్కడా తగ్గేదేలే అనే రీతిలో డ్రగ్స్ వినియోగిస్తునే ఉన్నారు. తాజాగా శుక్రవారం రాత్రి రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని క్యూరం పబ్‌పై అర్థరాత్రి ఎక్స్సైజ్ పోలీసుల దాడులు నిర్వహించారు. నాలెడ్జ్ సిటీలోని క్యూరం పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఎక్స్సైజ్ పోలీసులు ఏడుగురికి డ్రగ్స్ టెస్ట్‌లు చేయగా అందులో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. డ్రగ్స్ తీసుకున్న వారిలో చిన్న నగేష్(వరంగల్ ), నోర్తు రవికుమార్ (శ్రీకాకుళం ) వ్యక్తులుగా గుర్తించారు. ఈ తనిఖీల్లో ఎక్స్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, అనిల్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ యాంటీ నార్కోటిక్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story