దిశ పత్రికకు తీన్మార్‌ మల్లన్న అభినందనలు

by Naresh |
దిశ పత్రికకు తీన్మార్‌ మల్లన్న అభినందనలు
X

దిశ, అందోల్ః తన పేరిట ఉన్న భూమిని దేవుడి పేరుతో కబ్జా చేసేందుకు అధికార పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మునిపల్లి మండలం బుసారెడ్డి పల్లికి చెందిన పట్లోళ్ల ఏసంతి తీన్మార్‌ మల్లన్నకు గొడును వెల్లబుచ్చారు. శనివారం మునిపల్లి మండలంలో తీన్మార్‌ మల్లన్న పర్యటించి బుసారెడ్డి పల్లి శివారులోని 237 సర్వే నంబర్‌లోని 2.16 ఎకరాల భూమిలో మల్లన్న దేవుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, కబ్జా చేసేందుకు అధికార పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని బాధితుడు మల్లన్నకు వివరించారు. అంతేకాకుండా మార్చి 31, 2022 న దిశ దిన పత్రికలో దేవుడి పేరుతో భూకబ్జాకు కుట్ర అనే కథనంతో ప్రచురితమైన కథనాన్ని మల్లన్న దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పడు వెలుగులోకి తీసుకొస్తూ, ప్రభుత్వం దృష్టికి దిశ దినపత్రిక తీసుకెళ్లడంలో తన వంతు పాత్రను పోషిస్తుందంటూ దిశ పత్రికను మల్లన్న అభినందించారు.

Next Story

Most Viewed