- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తెలంగాణ పోలీసులకు సీఎం భారీ గుడ్ న్యూస్
by Y.Nagarani |
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు. వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారంగా అందిస్తామని ప్రకటించారు. గోషామహల్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన సీఎం.. ఈ కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కు కోటి రూపాయలు, ఎస్సై, సీఐలు వీరమరణం పొందితే రూ.1.25 కోట్లు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీలు వీరమరణం పొందితే రూ.1.50 కోట్లు, ఐపీఎస్ లు మరణిస్తే.. పరిహారంగా వారి కుటుంబాలకు రూ.2 కోట్లు ప్రభుత్వం ఇస్తుందని సీఎం తెలిపారు. అలాగే వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. శాశ్వతంగా అంగవైకల్యం పొందిన అధికారుల ర్యాంకును బట్టి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం స్పష్టం చేశారు.
Advertisement
Next Story