విమోచన దినోత్సవానికి CM KCR రావాల్సిందే.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Rajesh |
విమోచన దినోత్సవానికి CM KCR రావాల్సిందే.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. విమోచన దినోత్సవాన్ని జరపకుండా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. గతంలో విమోచన దినోత్సవం జరపాలని కాంగ్రెస్‌ను నిలదీసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. సెప్టెంబర్ 17న రాష్ట్రపతి భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతాయన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు.

ఈ వేడుకలతో పోరాట యోధులకు నిజమైన నివాళి అర్పించనట్లు అవుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మకు అయి విమోచన దినోత్సవాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు. విమోచన దినోత్సవాలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఆ రోజు రాజకీయ సభలు ప్లాన్ చేశాయని ఆరోపించారు. ఈ ఏడాది కూడా సీఎం కేసీఆర్‌ని విమోచన దినోత్సవానికి ఆహ్వానిస్తామని సీఎం కేసీఆర్ రావాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed