CM Revanth: ఖైరతాబాద్‌ ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా క్రేజ్

by Gantepaka Srikanth |
CM Revanth: ఖైరతాబాద్‌ ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా క్రేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణపతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం మహా గణపతికి సీఎం తొలి పూజ చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. దేశంలోనే ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఇది తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. ఆ గణపతి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిస్తామని హామీ ఇచ్చారు. ఈ పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.

అందులో భాగంగానే నిర్వహకులతో సచివాలయం వేదికగా సమావేశమై.. తగిన ఏర్పాట్లుచేశామని అన్నారు. ఉత్సవాలను మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున ఉచిత కరెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. అకాల వర్షాలతో ఈ ఏడాది రాష్ట్రంలో అనుకోని విపత్తు వచ్చి పడింది. ఆ దేవుడి దయవల్లే ఎక్కువ నష్టం జరుగలేదని అన్నారు. ఈ పూజలో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, విజయారెడ్డి, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story