BREAKING: ఉప్పల్‌లోని భరత్‌నగర్‌లో తీవ్ర విషాదం.. పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో మహిళ మృతి

by Shiva |
BREAKING: ఉప్పల్‌లోని భరత్‌నగర్‌లో తీవ్ర విషాదం.. పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో మహిళ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆయా జిల్లాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అయితే, హైదరాబాద్ నగర పరిధిలో ఓటింగ్ శాతం చాలా తక్కవ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పల్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భరత్ నగర్ ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి ఓటు వేసేందుకు వచ్చి గుండెపోటుతో పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలింది. గమనించిన సిబ్బంది ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం విజయలక్ష్మిని పరిశీలించిన వైద్యులు ఆమె చనిపోయినట్లుగా ధృవీకరించారు.



Next Story