BREAKING: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు పడిన తొలి అడుగు.. సచివాలయంలో సీఎం రేవంత్‌ భూమి పూజ

by Shiva |
BREAKING: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు పడిన తొలి అడుగు.. సచివాలయంలో సీఎం రేవంత్‌ భూమి పూజ
X

దిశ, వెబ్‌డెస్క్: సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం విగ్రహాన్ని ఏర్పాటు చేసే చోట భూమి‌పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేకే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై 2009 డిసెంబరు 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు ప్రతీకగా ఆ రోజునే విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ, విగ్రహ కొత్త నమూనాను మాత్రం ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాంలోనే స్వల్ప మార్పులు చేయబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

Next Story