ప్రభుత్వం చేస్తున్న పనికి ప్రజలు హర్షిస్తున్నారు: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-26 08:22:47.0  )
ప్రభుత్వం చేస్తున్న పనికి ప్రజలు హర్షిస్తున్నారు: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు లేదని అన్నారు. ‘హైడ్రా’కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం చేస్తున్న పనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనం హర్షిస్తున్నారని తెలిపారు. కూల్చివేత విషయంలో ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని స్పష్టం చేశారు. చెరువుల ఆక్రమణల విషయంలో సర్కార్ చాలా సీరియస్‌గా ముందుకు వెళ్తోందని, కూల్చివేతలు మాత్రం ఆగవని మంత్రి పొన్నం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed