BREAKING: ప్రధాని హోదాలో ఉన్న మోడీ దిగజారి మాట్లాడుతున్నారు: మంత్రి తుమ్మల సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 1 |
BREAKING: ప్రధాని హోదాలో ఉన్న మోడీ దిగజారి మాట్లాడుతున్నారు: మంత్రి తుమ్మల సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ దిగజారి మాట్లాడటం సరైంది కాదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. రాహుల్ గాంధీపై మోడీ చేసి వ్యాఖ్యల పట్ల ఆయన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి పదవే కవాలనుకుంటే ఇప్పటికి రెండు సార్లు పీఎం అయ్యే వారని తెలిపారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి త్వరలోనే పతనం తప్పదని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ రాముడిని బ్యాలెట్ బాక్స్‌లోకి తీసుకురావడం సిగ్గుచేటని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంతో మాజీ సీఎం కేసీఆర్‌కు దిగజారి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే కరెంట్ పోయిందంటూ కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడి కనీసం 4 నెలలు కూడా గడవలేదు.. అప్పడే రుణమాఫీ అంటూ తమపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏనాడు.. రూ.లక్ష రుణమాఫీ చేయలేదని మంత్రి తుమ్మల ఆరోపించారు.



Next Story

Most Viewed