BREAKING: రైతుల కష్టాలు నాకు తెలుసు.. శివరాజ్ సింగ్ చౌహన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-09-06 09:35:34.0  )
BREAKING: రైతుల కష్టాలు నాకు తెలుసు.. శివరాజ్ సింగ్ చౌహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అన్నదాతల కష్టాలు తనకు తెలుసనని.. తాను కూడా ఓ రైతునేని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లాలో వర్షం కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌తో కలిసి ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షం కారణంగా రైతాంగం అంతా ఆందోళనలో ఉందని పేర్కొన్నారు. వారందరిని కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్‌డీఆర్ఎఫ్ నిధులు కూడా సరిగ్గా వినియోగించుకోలేదని ఆరోపించారు. తాను కూడా రైతునేని.. ఆ కష్టాలు ఏంటో తనకు కూడా తెలసని అన్నారు. వరద బీభత్సం కారణంగా వరితో పాటు ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా పశువులు, ఇతర జీవ సంపద సైతం కనుమరుగైనట్లుగా గుర్తించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వరద బాధితులకు అండగా నిలుస్తామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed