BREAKING: గులాబీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి!

by Shiva Kumar |
BREAKING: గులాబీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి!
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. కారుపై గుర్తుపై గెలిచిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన హైదరాబాద్‌ మంత్రి జూపల్లిని పలుమార్లు కలిశారు. మరో రెండు లేదా మూడు రోజుల్లో సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక స్థానికంగా ఎమ్మెల్యేకు, గద్వాల జడ్పీ చైర్‌ పర్సన్‌ సరితకు మధ్య విబేధాలు తారా స్థాయికి చేరడంతో పార్టీ మారాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా సమాచారం. అయితే, మొదట తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ కెరీర్ ఆరంభించి కృష్ణమోహన్ రెడ్డి 2009లో గద్వాల నియోజవకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో 2014లో ఆ పార్టీలో చేరి మళ్లీ గద్వాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వచ్చిన 2018, 2023 సాధారణ ఎన్నికల్లో వరుసగా గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Next Story