BIG News: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మెయిన్స్‌కు ఎంపికపై టీజీపీఎస్‌సీ కీలక నిర్ణయం

by Shiva Kumar |
BIG News: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మెయిన్స్‌కు ఎంపికపై టీజీపీఎస్‌సీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 అభ్యర్థులకు టీజీపీఎస్‌సీ కీలక సూచన చేసింది. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 పద్ధతిలోనే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జీఏడీ జారీ చేసిన జీవో నెంబర్‌ 29, 55 మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొంది. అయితే, గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉండాలంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మెయిన్స్ ఎంపికపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా 1:100 నిష్పత్తి పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక సాధ్యం కాదని వెల్లడిస్తూ టీజీపీఎస్సీ మెమో జారీ చేసింది. గ్రూప్‌-1 సర్వీసులకు నిర్వహించిన పరీక్ష ఆధారంగా జీఏడీ జారీ చేసిన జీవోలకు లోబడి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు టీజీపీఎస్సీ పేర్కొంది.

Next Story