- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
భద్రాద్రి పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం.. అధికారులకు డిప్యూటీ CM భట్టి కీలక ఆదేశాలు..!
by Satheesh |
X
దిశ, వెబ్డెస్క్: యుద్ధ ప్రాతిపదికన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాద ఘటనపై సంబంధిత అధికారులతో ఆదివారం భట్టి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిపుణుల పరిశీలన తర్వాత పూర్తి సమాచారం వస్తుందని తెలిపారు. ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాగా, శుక్రవారం కురిసిన భారీ వర్షానికి భద్రాద్రి జిల్లా మణుగూర్లోని థర్మల్ ప్లాంట్లో పిడుగు పడి అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఫైర్ యాక్సిడెంట్ వలన పవర్ ప్లాంట్లో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు పనులు చేపట్టారు.
Advertisement
Next Story