- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఏపీలో ఆ పోలీస్ అధికారులపై వేటు
X
దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు అధికారులపై వేటు పడింది. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్రెడ్డిని వీఆర్కు పంపి ఆయన స్థానంలో ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. కాగా సీఐ మహేశ్వర్రెడ్డి నిన్న రాత్రి నుంచి ఫోన్ స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆయన బెంగుళూరుకు వెళ్ళినట్టు అధికారులు గుర్తించారు. నటి, మోడల్ కాదంబరీ జత్వానీ కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఎన్నికల హింసకు సంబంధించి డీజీపీ ఐదుగురు అధికారులపై డీజీపీ వేటు వేయడం పోలీస్ వర్గా్ల్లో కలకలం రేపింది.
Next Story