టీ.కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ నియామకం

by Disha Web Desk 2 |
టీ.కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీని నియమించారు. గురువారం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీ.మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. సభ్యులుగా మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ మంత్రి కే.పుష్పలీల, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎంఆర్జీ వినోద్ రెడ్డి, క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ దివ్యవాణి చౌదరి, పీసీసీ స్పోక్ పర్సన్, కోఆర్డినేటర్ మరియు ఏఐసీసీ ఓబీసీ డిపార్టుమెంట్ సభ్యుడు కత్తి వెంకటస్వామిని నియామకం అయ్యారు.



Next Story

Most Viewed