- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
హర్షసాయి కేసులో మరో ట్విస్ట్
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి(Harsha Sai) మీద లైంగిక దాడి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నేడు మరో కీలక మలుపు చోటు చేసుకుంది. హర్షసాయికి అనుకూలంగా, తనను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని బాధితురాలు.. ఆర్జే శేఖర్ బాషాతోపాటు మరికొంతమంది మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు ఆర్జే శేఖర్ బాషాను విచారించారు. ప్రస్తుతం హర్షసాయి పరారీలో ఉండగా.. అతని గురించి మరింత సమాచారం రాబట్టేందుకు శేఖర్ ను ప్రశ్నించినట్టు సమాచారం. కాగా తనను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి, తనపై ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుండి హర్ష పరారీలో ఉన్నాడు. దేశం విడిచి పారిపోయాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ.. సరైన ఆధారాలు లేకుండా లుక్ అవుట్ నోటీస్ జారీ చేయలేమని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో సదరు యువతి కావాలనే హర్షసాయిని ఇరికించిందని కించపరుస్తూ, వ్యక్తిగత వ్యాఖ్యలను శేఖర్ బాషా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టగా.. ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.