- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ 51 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఈ మేరకు మంగళవారం గెజిట్ విడుదల చేసింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకున్నది. తక్షణమే గెజిట్ అమల్లోకి వస్తుందని విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో మేడ్చల్ మున్సిపాలిటీలోకి, దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి, పోచారం మున్సిపాలిటీలోకి, ఘట్కేసర్ మున్సిపాలిటీలోకి, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోకి, అమీన్పూర్ మున్సిపాలిటీలోకి, తెల్లాపూర్ మున్సిపాలిటీలోకి 51 గ్రామాలు విలీనం కానున్నాయి. దీంతో ఇప్పటివరకు పంచాయతీ అధికారుల చేతుల్లో ఉన్న రికార్డులు ఇక మున్సిపల్ అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి.
Advertisement
Next Story