జిల్లా సమగ్ర సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలి.. కలెక్టర్

by Sumithra |
జిల్లా సమగ్ర సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలి.. కలెక్టర్
X

దిశ, ఆసిఫాబాద్ : జిల్లా సమగ్ర సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా సమగ్ర గణాంక హ్యాండ్ బుక్ ను ఆ శాఖ జిల్లా ఇన్చార్జి ముఖ్యప్రణాళికా అధికారి పాపయ్యతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. హ్యాండ్ బుక్ లో ఉన్న వివరాలను. పూర్తి సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా ప్రజలకు చేరవేయాలని సూచించారు. జిల్లాపూర్తి సమాచారాన్ని హ్యాండ్ బుక్ లో పొందుపరచాల న్నారు. అలాగే వాతావరణ వివరాలను రోజు వారీగా ప్రకటించాలన్నారు. అంతకు ముందు చేపల పెంపకం పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు ఎకరాల స్థలం. బోర్ సదుపాయం కలిగిన రైతులకు చేపల పెంపకం అనువుగా ఉంటుందనీ. ఇందుకు ప్రభుత్వం రాయితీ అందిస్తుందని చెప్పారు. రైతులు స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

Next Story