మోసపూరిత హామీలిచ్చిన సీఎంపై కేసు నమోదు చేయాలి : జోగు రామన్న

by Aamani |
మోసపూరిత హామీలిచ్చిన సీఎంపై కేసు నమోదు చేయాలి :  జోగు రామన్న
X

దిశ, ఆదిలాబాద్ : మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు.బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూసీ నది ప్రాజెక్టు లో భారీ స్కాం చోటు చేసుకుందని ఆరోపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పైన కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అక్రమ కేసులతో తమను ఆపే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. ఈనెల ఎనిమిదో తేదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజానికానికి హామీలు ఇచ్చి మోసం చేశారని డీఎస్పీ కి ఫిర్యాదు చేశామని, ఇప్పటికీ కేసు నమోదు కాలేదని ఆరోపించారు.

కేటీఆర్ చేసిన ఆరోపణలపై వెంటనే కేసు నమోదు చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. 420 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆశలను గల్లంతు చేశారని, రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేశారు.ఇంకా ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన సీఎం కు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అజయ్, ఇజ్జగిరి నారాయణ, యాసం నర్సింగరావు, మారిశెట్టి గోవర్ధన్, కుంమ్ర రాజు,పరమేశ్వర్, ఇజ్జగిరి అశోక్, పురుషోత్తం, నవాతే శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed