అమానవీయం.. చెత్తకుప్పలో పసికందు లభ్యం

by Disha Web Desk 23 |
అమానవీయం.. చెత్తకుప్పలో పసికందు లభ్యం
X

దిశ,జన్నారం : జన్నారం మండల కేంద్రంలోని దర్మారం రోడ్డు కల్వర్టు సమీపంలో పిచ్చి మొక్కల మద్యగల చెత్త కుప్పలో అప్పడే జన్మించిన ఆడ శిశువును గుర్తు తెలియని వారు పడేశారు. పూర్తి వివరాలకు వెళితే సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎండ తీవ్రతకు శిశువు రోదిస్తుండడంతో పక్క ఇంటి వారికి శిశువు రోదనలు వినిపించడంతో అటు వైపు వెళ్లి వారు పరీశీలించగ ఏడుపు ఆగిపోవడంతో కర్రతో అటు ఇటు కవర్లను జరుపగా శిశువు కనిపించింది.

వెంటనే 100కు డయల్ చేశారు. ఎస్సై రాజవర్దన్ ఆదేశాల మేరకు స్థానిక కానిస్టేబుల్ శ్రీనివాస్, తుకారం లు ఆ ప్రాంతాలకు వెళ్లి పరిశీలించగా ఆడ శిశువు కనిపించింది. వెంటనే ఆ శిశువును పోలీసులు స్థానిక భవాని పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు. ఆ శిశువును ఎవరు పడేశారో అని మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించడంతో ఐసిడిఎస్ అధికారులు శిశువును స్వాదీనం చేసుకుని మంచిర్యాల ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed