- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐదు రోజుల్లో 4.5 లక్షల ఎకరాలు.. పంట నష్టంపై ప్రాథమిక అంచనా!
by Satheesh |

X
దిశ, తెలంగాణ బ్యూరో: గడిచిన ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. వీటిలో3.5 లక్షల ఎకరాల్లో వరి పంటతో పాటు ఆ తర్వాత మామిడి, మొక్కజొన్న, నువ్వులు, పెసర, జొన్న, పొద్దు తిరుగుడు, బొప్పాయి, నిమ్మ, ఇతర పండ్ల తోటలు, కూరగాయల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో పంట నష్టాలు జరిగాయని వ్యవసాయ శాఖ తేల్చింది. ఆ తర్వాత సూర్యాపేట, కరీంనగర్, జనగామ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నది.
Next Story