- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దళితులను ఆదుకోవడంలో రాష్ట్రం ముందంజ
by Shyam |

X
దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన భ్యాగరి నర్సింహులు రైతు కుటుంబానికి భూమి తాలూకు పత్రాలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్బంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఓ దళిత కుటుంబాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదుకోవడంలో ఈ ఘటన చరిత్రలో నిలుస్తుందన్నారు. దళితులను ఆదుకోవడంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు.
గతంలో మంత్రి హరీష్ రావు బాధిత నర్సింహులు కుటుంబానికి రూ. 2 లక్షలు ఎక్స్గ్రేషియా, ఉద్యోగం, ఒక ఎకరం భూమిని ఇస్తామని హామీ ఇవ్వగా.. ఇప్పుడు ఇచ్చిన హామీ కంటే అదనంగా మరో అర ఎకరం భూమిలో ఒక బోర్ వేసి ఇచ్చామని స్పష్టం చేశారు. నర్సింహులు మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Also…
Next Story