వాటర్‌ ప్రూఫ్‌ టెక్నాలజీతో Oppo కొత్త స్మార్ట్‌ఫోన్

by Harish |
వాటర్‌ ప్రూఫ్‌ టెక్నాలజీతో Oppo కొత్త స్మార్ట్‌ఫోన్
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Oppo కొత్తగా ఇండియా మరో మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు Oppo F27 Pro+ 5G. ముఖ్యంగా ఇది వాటర్‌ ప్రూఫ్‌ టెక్నాలజీతో వస్తుంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP69, IP68, IP66 రేటింగ్‌‌ను కలిగి ఉంది. 8GB RAM + 128GB ధర రూ.27,999, 8GB RAM+ 256GB వేరియంట్ ధర రూ. 29,999. ప్రస్తుతం ఈ మోడల్ కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశంలో ముందస్తు బుక్ చేసుకోడానికి అందుబాటులో ఉంది. జూన్ 20 అధికారిక విక్రయాలు ప్రారంభమవుతాయి. ఫోన్ డస్క్ పింక్, మిడ్‌నైట్ నేవీ కలర్స్‌లలో లభిస్తుంది.



Oppo F27 Pro+ 5G స్పెసిఫికేషన్లు

* 6.7-అంగుళాల పూర్తి-HD+ (2,412 x 1,080 పిక్సెల్‌లు) 3D కర్వ్డ్ OLED స్క్రీన్‌

* 120Hz రిఫ్రెష్ రేట్‌, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్.

* ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7050 SoC ద్వారా పనిచేస్తుంది.

* ఆండ్రాయిడ్ 14-ఆధారిత ColorOS 14తో రన్ అవుతుంది.

* 5 స్టార్స్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

* బ్యాక్‌సైడ్ 64 MP+2 MP కెమెరాలు ఉన్నాయి

* ముందు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది.

* 67W వైర్డు చార్జింగ్‌‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.

* ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఇన్-డిస్‌ప్లే‌లో అందించారు.

Advertisement

Next Story

Most Viewed