ఏపీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

by srinivas |
ఏపీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
X

దిశ, ఏపీబ్యూరో: గవర్నర్‌ కోటా కింద నామినేట్ అయిన ఎమ్మెల్సీలు సోమవారం అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌‌ల చేత ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి విఠపు బాలసుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మేకతోటి సుచరిత, శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed