న్యాయ కమిషన్‌ను సంప్రదించండి: సుప్రీంకోర్టు

by Shamantha N |
న్యాయ కమిషన్‌ను సంప్రదించండి: సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: దిశ నిందితుల కుటుంబాలు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే న్యాయ కమిషన్ విచారణ ప్రారంభించిందని, ఏదైనా చెప్పాలనుకుంటే కమిషన్ ముందే చెప్పాలని నిందితుల కుటుంబాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా వారు వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కూడా కోర్టు సూచించింది. కాగా, గతేడాది డిసెంబర్‌లో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed