క్వార్టర్ ఫైనల్లో ఓడిన రెజ్లర్ రితికా

by M.Rajitha |
క్వార్టర్ ఫైనల్లో ఓడిన రెజ్లర్ రితికా
X

దిశ, వెబ్ డెస్క్ : ఒలంపిక్ రెజ్లింగ్ లో భారత్ కు మరో నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో రెజ్లర్ రితికా హుడా ఓడిపోయింది. 76 కేజీల మహిళల విభాగంలో బరిలోకి దిగిన రితికా క్వార్టర్ ఫైనల్ లో తన ప్రత్యర్థి కిర్గిస్థాన్ కు చెందిన వరల్డ్ నం.1, ఐపెరి మెడేట్ కైజి చేతిలో ఓటమి పాలయ్యింది. శనివారం మధ్యాహ్నం జరిగిన పోటీలో బౌట్ చివర్లో 1-3 తేడాతో ఓడిపోయి భారత అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే ఉదయం హంగేరికి చెందిన బెర్నాడేట్ తో ప్రిక్వార్టర్స్ లో గెలిచిన విషయం తెలిసిందే. కాగా రెజ్లింగ్ లో ఇప్పటి వరకు అమన్ ఒక్కడే కాంస్య పతకం సాధించగా.. ఫైనల్ వరకు వెళ్ళి అనర్హత వేటు ఎదుర్కొంటున్న వినేష్ సిల్వర్ మెడల్ కోసం కోర్టుకు వెళ్ళింది. పారిస్ సిఏఎస్ కోర్ట్ తీర్పు వినేష్ కు అనుకూలంగా వస్తే రెజ్లింగ్ లో వెండి పతకం మెరవనుంది. ఇప్పటి వరకు భారత్ కు ఒక సిల్వర్ సహ మొత్తం ఆరు పతకాలు వచ్చాయి.

Next Story

Most Viewed