Ap News: పోలవరంలో ప్రభుత్వ కార్యాలయానికి తాళం

by srinivas |
Ap News: పోలవరంలో ప్రభుత్వ కార్యాలయానికి తాళం
X

దిశ, పోలవరం: అది పేరుకే ప్రభుత్వాఫీసు.. ఏ రోజు ఏ సమయంలో చూసినా కుర్చీలు ఖాళీగానే దర్శనమిస్తాయి. మారుమూల మండల కేంద్రం ఎవరూ పట్టించుకోరని అనుకున్నట్లున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ వేసేసి సొంత పనులు చూసుకుంటుంటారు. సాక్షాత్ మండల పరిషత్ అధ్యక్షుడు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ సిబ్బంది కోసం ఎదురుచూసి ఎవరూ రాకపోవడంతో కోపంతో ఆఫీసుకు తాళం వేసేశారు.

పోలవరం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నెలకొన్న పరిస్థితిపై మండల పరిషత్ అధ్యక్షుడు సుంకర వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి కూడా అధికారులు ఏ ఒక్కరు రాలేదని ప్రజా సమస్యలు ఎలా తీరుస్తారని ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి ప్రశ్నించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇద్దరిని కార్యాలయంలో ఉంచి మిగిలిన వారంతా వెళ్లిపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తానని అన్నారు.


Next Story