IND Vs WI 3rd T20 : విండీస్‌తో మూడో టీ20.. యశస్వీ జైస్వాల్ ఇన్.. సంజూ శాంసన్ ఔట్!

by Vinod kumar |
IND Vs WI 3rd T20 : విండీస్‌తో మూడో టీ20.. యశస్వీ జైస్వాల్ ఇన్.. సంజూ శాంసన్ ఔట్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన భారత్.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మంగళవారం గయానా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన టీమ్​ఇండియా తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే టీమ్​ఇండియా తుది జట్టులో సంజూ శాంసన్‌ను తప్పించి.. యశస్వీ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిపై వేటు వేసి యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్‌కు చోటిచ్చే అవకాశం ఉంది. అదే జోరును కొనసాగించి ఆధిక్యాన్ని ట్రిపుల్ చేసుకోవాలని విండీస్ భావిస్తోంది.

భారత్ తుది జట్టు(అంచనా):

యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్/సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్​ కుమార్/ఉనాద్కత్, యుజ్వేంద్ర చాహల్​

Advertisement

Next Story

Most Viewed