India vs West Indies 3rd T20: వెస్టిండీస్‌తో హార్దిక్ సేన ఢీ.. టాస్ గెలిచిన విండీస్

by Vinod kumar |
India vs West Indies 3rd T20: వెస్టిండీస్‌తో హార్దిక్ సేన ఢీ.. టాస్ గెలిచిన విండీస్
X

దిశ, వెబ్‌డెస్క్: గయానా వేదికగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 3వ టీ-20 మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఇషాన్‌ కిషన్‌ స్థానంలో అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్‌ జట్టులోకి రాగా.. రవి బిష్ణోయ్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ జట్టులో చేరాడు. మరోవైపు విండీస్‌ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జేసన్‌ హోల్డర్‌ స్థానంలో రోస్టన్‌ ఛేజ్‌ బరిలోకి దిగనున్నాడు.

మొదటి రెండు మ్యాచుల్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, మిగిలిన బ్యాటర్లు సరిగ్గా రాణించలేకపోయారు. ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్‌తో పాటు ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఇప్పటికే వరుసగా రెండు టీ-20 మ్యాచ్‌లలో ఓడిపోయిన నేపథ్యంలో తాజా మ్యాచ్‌ను గెలుస్తామనే ధీమాలో భారత జట్టు ఉంది. మరోవైపు రెండు మ్యాచ్‌లు గెలిచిన ఉత్సాహంతో వెస్టిండీస్‌ జట్టు సిరీస్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు జరగనున్న మూడో టి20 మ్యాచ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):

కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (సి), రోస్టన్‌ ఛేజ్‌, రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్

భారత్ (ప్లేయింగ్ XI):

శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

Advertisement

Next Story

Most Viewed