Ravichandran Ashwin: మరోసారి విండీస్‌ బోర్డు తీరుపై అశ్విన్‌ ఫైర్..

by Vinod kumar |
Ravichandran Ashwin: మరోసారి విండీస్‌ బోర్డు తీరుపై అశ్విన్‌ ఫైర్..
X

దిశ, వెబ్‌డెస్క్: విండీస్‌ క్రికెట్ మైదానాల్లో సరైన సదుపాయాలు లేవని విమర్శలు గుప్పించిన రవిచంద్రన్ అశ్విన్‌ మరోసారి ట్విటర్‌ వేదికగా స్పందించాడు. భారత్-విండీస్‌ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడంపై విమర్శించాడు. 30 అడుగుల సర్కిల్‌ను మార్క్‌ చేయడంలో గయానా మైదానం సిబ్బంది జాప్యం చేశారు. దీంతో మ్యాచ్‌ దాదాపు 5 నిమిషాలపాటు ఆలస్యంగా ప్రారంభమైంది. దీనిని ఉద్దేశిస్తూ అశ్విన్‌ ట్వీట్ చేశాడు. ‘‘ఇది ప్రత్యేకమైన జాప్యం. ఇలాంటి కారణాలతో పర్యటించడం అంత సులువేం కాదు. క్రికెటర్‌గా ఇలాంటి ఊహించని పరిస్థితులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed