Pro Kabaddi League -11.. మొదటి మ్యాచులోనే తెలుగు టైటన్ ఘన విజయం

by Mahesh |
Pro Kabaddi League -11.. మొదటి మ్యాచులోనే తెలుగు టైటన్ ఘన విజయం
X

దిశ, వెబ్ డెస్క్: భారత పురాతన, సంస్కృతిక క్రీడల్లో ఒకటైన కబడ్డీ.. గత పది సీజన్లుగా.. ప్రో కబడ్డీ లీగ్ పేరుతో దేశమంతా ఆదరణ పొందింది. ఈ క్రమంలో సీజన్ 11 కు భారీ డిమాండ్ పెరగడంతో వేలంలో ప్లేయర్లు కూడా భారీ ధర పలికారు. నేడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 అట్టహాసంగా ప్రారంభం అయింది. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచులో టైటాన్స్ కెప్టెన్ పవన్ శరావత్ మొదటి నుంచి దూకుడుగా ఆడాడు. దీంతో స్టార్టింగ్ నుంచి మొదటి, రెండో హాఫ్ లలో తెలుగు టైటాన్స్ జట్టు బెంగళూరు పై ఆధిపత్యం కొనసాగింది. దీంతో పూర్తి సమయం ముగిసే సరికి తెలుగు టైటాన్స్ జట్టు 37 పాయింట్లతో లీడ్ లో ఉండగా బెంగళూరు బుల్స్ జట్టు 29 పాయింట్లతో నిలిచింది. దీంతో తెలుగు టైటాన్స్ జట్టు బెంగళూరు బుల్స్ జట్టుపై 8 పాయింట్ల తేడాతో విజయం సాధించి.. మొదటి మ్యాచులోనే ఖతాను తెరిచింది. ఇదిలా ఉంటే గత సీజన్ లో తెలుగు టైటాన్స్ జట్టు మొదటి విజయం సాధించడానికి ఐదు మ్యాచులు వేచి చూసింది. తాజాగా మొదటి మ్యాచులోనే విజయం సాధించడం కెప్టెన్ పవన్ శరావత్ తో పాటు డిఫెండర్ క్రిషన్, అంకిత్, ఆల్ రౌండర్ విజయ్ మాలిక్ సాగర్ మంచి ఫామ్ కొనసాగించడం.. టైటాన్స్ జట్టుకు కలిసొచ్చేలా ఉంది. మరీ ఈ సీజన్ మొత్తం పవన్ శరావత్ జట్టు ఇలానే రాణిస్తే ఈ సారి టైటిల్ నెగ్గడం ఖాయంగా కనిపిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed