- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Paris Olympics : టేబుల్ టెన్నిస్లో అమ్మాయిలకు తప్పని నిరాశ
దిశ, వెబ్డెస్క్ : ఇండియన్ స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పై ఒలింపిక్ సంఘం వేటు వేసిన వార్తపై నిరాశలో ఉన్న భారత క్రీడా అభిమానులకు మరో నిరాశ తప్పలేదు. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో భారత పోరాటం ముగిసింది. ఇప్పిటికే వ్యక్తిగత విభాగాల్లో నిరాశపరిచిన మన ప్లేయర్లు టీమ్ ఈవెంట్లోనూ సత్తా చాటలేకపోయారు. మనికా బత్రా, ఆకుల శ్రీజ , అర్చనా కామత్ల త్రయం, జర్మనీ జట్టు చేతిలో 1-3 తేడాతో ఓటమి పాలయింది. దాంతో, పురుషుల మాదిరిగానే మహిళలు కూడా ఉత్త చేతులతోనే ఇండియాకు రానున్నారు.
అయితే .. ఒలింపిక్ క్రీడల్లో పతకంపై ఆశలు రేపిన పురుషుల టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు కీలక మ్యాచుల్లో ఓడారు. వ్యక్తిగత విభాగంలో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సీనియర్ ఆటగాడు అచంత శరత్ కమల్ టీమ్ ఈవెంట్లోనూ నిరాశ పరిచాడు. దాంతో, పారిస్ ఒలింపిక్స్లో పురుషుల టీమ్ చెత్త ప్రదర్శనతో వెనుతిరిగింది. అచంత శరత్ కమల్, మానవ్ థక్కర్, హమిత్ దేశాయ్ త్రయం క్వార్టర్స్ బెర్తు సాధించలేకపోయింది. కాగా నిన్న జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో పురుషుల టీం, నెంబర్ వన్ సీడ్ చైనా చేతిలో 0-3 తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.