కెప్టెన్ గా వైదొలిగిన తర్వాత తొలిసారి స్పందించిన ధోని..

by Dishanational6 |
కెప్టెన్ గా వైదొలిగిన తర్వాత తొలిసారి స్పందించిన ధోని..
X

దిశ, స్పోర్ట్స్: సీఎస్కే కెప్టెన్ గా వైదొలిగిన తర్వాత తొలిసారిగా ఎంఎస్ ధోని స్పందించాడు. తనకు మజిల్ పవర్ తక్కువని.. ఫీల్డింగ్ తప్పుల గురించి త్వరగా స్పందించలేనని పేర్కొన్నాడు. ఫీల్డింగ్ లో పొరపాట్లు చేస్తే.. తాను పెద్దగా స్పందించనని స్పష్టం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఓ ఇన్సిడెంట్ జరిగింది. దానిపై ధోని మాట్లాడాడు. కివీస్ స్టార్ రచిన్ రవీంద్ర.. సాయి సుదర్శన్ క్యాచ్ వదిలేశాడు. దీనిపై స్పందిస్తూ.. తాను కెప్టెన్ ని కానని కాజ్యువల్ గా ఆన్సర్ ఇచ్చాడు.

మరోవైపు ఎవరైన ఫస్ట్ గేమ్ లేదా సెకండ్ గేమ్ ఆడుతున్నప్పుడు తాను ఎక్కువగా స్పందించనని చెప్పాడు. కానీ, రచిన్ ఫీల్డ్ అంతా తిరుగుతూ చూడటం చాలా సరదాగా ఉందని తెలిపాడు. రుతురాజ్ గైక్వాడ్ ని ప్రశంసలతో ముంచెత్తాడు ధోని. గైక్వాడ్ కూడా.. ఫీల్డర్లు తప్పు చేస్తే పెద్దగా స్పందించడనని తెలిపాడు. "మీరు క్యాచ్ మిస్ అయినప్పుడు, మీరు MS వైపు చూశారా? అతను ఎలా స్పందించాడు? అతను మీకు ఏమి చెప్పాడు? ” అని రచిన్ రవీంద్రను మీడియా అడగ్గా.. కొత్త కెప్టెన్ ఉన్నాడు అని ఆన్సర్ ఇచ్చినట్లు తెలిపాడు.


Next Story